సైబరాబాద్ కమిషనరేట్‌లో రివార్డ్స్ డే

by  |
సైబరాబాద్ కమిషనరేట్‌లో రివార్డ్స్ డే
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో నేరాలు రుజువు చేసి, నిందితులకు శిక్ష పడేలా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ సజ్జనార్ అభినందించారు. శనివారం సీపీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈఏడాది 5జీవిత ఖైధులతో పాటు 42కేసుల్లో శిక్షలు పడినట్టు వెల్లడించారు. అందుకు ఇన్వెస్టిగేషన్ అధికారులు, కోర్టు సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను శాలువా, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ ఏడాది కరోనా కారణంగా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. 25మంది సీడీఓలు, 13మంది ఎస్‌హెచ్‌ఓలు, 13మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సత్కరించారు.


Next Story

Most Viewed