టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్.. మరుసటి రోజు ఏం చేశారంటే..!

by  |
టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్.. మరుసటి రోజు ఏం చేశారంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జనం గుండెల్లో చెరగని సంతకం’ అంటూ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్.. అనంతరం జరిగిన సభలో ప్రభుత్వాన్ని ‘ప్రశ్నించే గొంతుక’ అని మరోసారి నిరూపించుకున్నారు. టీపీసీసీ ప్రకటన నుంచి ప్రమాణస్వీకారం వరకు ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్‌ నేతలను టచ్ చేశారు. జాతీయ స్థాయిలో కూడా భేటీ అయ్యారు. పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తున్నారు. గురువారం దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా.. పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు టీపీసీసీ రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed