నాగం జనార్ధన్ రెడ్డిని కలిసిన రేవంత్

by  |
నాగం జనార్ధన్ రెడ్డిని కలిసిన రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. స్వయంగా నాగం ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు నాగం కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ చీఫ్‌గా నియమితులైనందుకు రేవంత్‌కు నాగం జనార్ధన్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానం చేశారు. గతంలో రేవంత్, నాగం జనార్ధన్ రెడ్డి టీడీపీలో కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన తర్వాత వరుసగా సీనియర్ నేతలను రేవంత్ కలుస్తున్నారు. అందులో భాగంగా నాగంను కలిసినట్లు తెలుస్తోంది.



Next Story