కవిత ఫొటోపై రేవంత్ రెడ్డి​ ఘాటు విమర్శలు

by  |
Revanth Kavitha
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాలుగేండ్ల కిందట సీఎం కేసీఆర్​ దత్తత తీసుకున్న గ్రామాలను అభివృద్ధి చేస్తామని పేదలను ఆశపెట్టాడని టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. సీఎం దత్తత గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారో చూపించాలని సవాల్​ విసిరితే టీఆర్ఎస్ ​నేతలు పారిపోయారని, సీఎం ఇచ్చిన ఒక్క హామీని అమలు చేసినట్లైతే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని సవాల్​ చేసినా ఒక్క టీఆర్ఎస్​ నాయకుడు రాలేదన్నారు. ఇప్పటి వరకు బ్రోకర్లు.. జోకర్లును చూశామని, కానీ టీఆర్ఎస్ ​నేతలు బ్రోకర్లు, జోకర్లుగా మారారు.

మంత్రి మల్లారెడ్డి బ్రోకర్‌గా అవతారమెత్తాడు. భూములు అమ్మినా కొన్నా మల్లారెడ్డికి కమీషన్​ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. సూరారంలో చెరువును ఆక్రమించి, తూమును కూల్చి కాలేజీలు కట్టుకున్నాడని విమర్శించారు. మల్లారెడ్డి అల్లుడు ఔటర్​రింగ్​రోడ్డు పక్కన చెరువును మింగాడన్నారు. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇంజినీరింగ్, వైద్య కాలేజీల్లో ప్రొఫెసర్లు లేరన్నారు. ఈ ప్రాంతంలో ఈ వివాదస్పద భూమిని చూసిన మల్లారెడ్డి బంధువులదేనన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి 25 ఎకరాల భూమి ఇచ్చాడో అదంతా దొంగ భూమి అని, దొంగ పత్రాలతో మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తెచ్చుకున్నాడని రేవంత్​రెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ కింద తీసుకున్న భూమి అసైన్​మెంట్​భూమి అని, దానికి పాస్​బుక్కులు సృష్టించారన్నారు.

మల్లారెడ్డి అవినీతిపై విచారణకు సిద్ధమా..?

ఆనాడు కేసీఆర్​ ఇంటి పంచాయతీపై ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం రాజయ్యను పదవి నుంచి తొలగించారని, కానీ ఇప్పుడు మల్లారెడ్డి 20 ఎకరాలకు తప్పుడు పత్రాలను సృష్టించి ట్రస్టుకు గిప్ట్​ డీడీ పేరుతో అనుమతి ఇచ్చారని, దీనిపై విచారణకు ఆదేశించాలని రేవంత్​రెడ్డి సవాల్​ విసిరారు. ప్రతి ఊరిలో ఇక నుంచి మల్లారెడ్డి అవినీతిపై దండోరా వేయిస్తామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీకి అడ్డు వస్తానని మల్లారెడ్డి అల్లుడు అన్నాడని, ఒక్క కాంగ్రెస్​ కార్యకర్తను అడ్డుకున్నా తొక్కి పెడ్తామని హెచ్చరించారు.

పోలీస్​ స్టేషన్లలో దొంగల్లా ఉన్నారు

కేసీఆర్​, కేటీఆర్​, కవితారావు, కన్నారావుతో పాటు మల్లారెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, రాజశేఖర్​రెడ్డి, గోపాల్​రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, ఆ ఫొటోలను చూస్తే పోలీస్​ స్టేషన్లలో దొంగల ఫొటోల మాదిరిగా కనిపించాయని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. దళితుల సమస్యలను లోతుగా తెలుసుకునేందుకే రచ్చబండ పెట్టానన్నారు.

Readmore

అయ్యా, కొడుకుల నడుమ ఏకాభిప్రాయమే లేదు : రేవంత్



Next Story

Most Viewed