రేవంత్‌కు షాక్… బీజేపీ గూటికి రైట్ హ్యాండ్

by  |
రేవంత్‌కు షాక్… బీజేపీ గూటికి రైట్ హ్యాండ్
X

దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికలవేళ ఎల్ బీ నగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరారు.

రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేవైఎం జాతీయ కార్యదర్శి కాచం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు కొప్పుల. అనంతరం కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మన్సూరాబాద్ డివిజన్ నుండి కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కొప్పుల బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్టు సమాచారం. దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత గ్రేటర్ లో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

కాగా కొప్పుల బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రేవంత్ వర్గం షాక్ లో ఉంది. మొన్నటిదాకా రేవంత్ రెడ్డికి కుడిభుజంగా ఉంటూ… అన్నీ తానై నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నడిపిన కొప్పుల నర్సింహారెడ్డి పార్టీని వీడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది.



Next Story

Most Viewed