మా భూములు తిరిగిచ్చేయండి

by  |
మా భూములు తిరిగిచ్చేయండి
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలోని తొటపల్లి రిజర్వాయర్ కోసం సేకరించిన భూములను తిరిగి తమకు ఇవ్వాలని భూనిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు చిగురుమామిడి మండలంలోని ఒగులాపూర్ గ్రామ రైతులు భూముల కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఏలేటి వెంకట్‌రెడ్డిలు రైతులతో కలిసి హన్మకొండలో ఉన్న ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌కు తీర్మాన కాపీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్లెం రాజేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాం మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story