- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నల్లగొండ: పట్టణానికి చెందిన రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ బషీరుద్దీన్ (84) శుక్రవారం మృతి చెందారు. దేవరకొండలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన రెవెన్యూ శాఖలో తహసిల్దార్, ఆర్డీఓగా విధులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఆర్డీఓగా, చిత్తూరు జిల్లా ఇంఛార్జ్ డీఆర్ఓగా విధులు నిర్వహించి డిప్యూటీ కలెక్టర్ హోదాలో పదవీవిరమణ చేశారు. అనంతరం కొంతకాలం మిర్యాలగూడలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా కూడా విధులు నిర్వహించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపతుడున్న ఆయన.. నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. శుక్రవారం మధ్యాహ్నం అకస్మికంగా గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి నగర శివారులోని ఈద్గా వద్ద ఉన్న స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి పట్ట పలువురు సంతాపం వ్యక్తం చేశారు.