- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మధిర : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కరోన నిబంధనలు కట్టదిట్టం చేస్తుంటే.. స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం వాటికి తూట్లు పోడుస్తున్నారు. ఏకంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సహా ఇతర నేతలు ఏ ఓక్కరూ కూడా మాస్కులు పెట్టుకున్న పాపాన పోలేదు. బుధవారం ముదిగోండ మండలం ముత్తారం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణా స్వీకారోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, నూతన పాలక వర్గం సభ్యులు.. కరోనా నిబంధనలు పాటించలేదు. ఏ ఒక్కరూ మాస్కు ధరించలేదు. సామాన్యులు మాస్కు పెట్టు కోకుంటే అధికారులు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులై ఉండి మాస్కులు పెట్టుకోక పోవటం ఏమిటని స్థానికులు చర్చించుకున్నారు. నలుగురికి చెప్పాల్సిన నాయకులే ఈ విధంగా వ్యవహరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.