కరోనాతో రిపోర్టర్ మృతి

by  |
కరోనాతో రిపోర్టర్ మృతి
X

దిశ, ముథోల్ : బైంసా పట్టణానికి చెందిన సాయినాథ్ ఓ టీవీ న్యూస్ రిపోర్టర్ పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలం కింద ఇతనికి కరోనా వ్యాధి సోకింది. దీంతో సాయినాథ్ ని చికిత్స నిమిత్తం నిజామాబాద్ కి తరలించారు. అక్కడ పరిస్థితి బాగా లేక పోవడంతో తర్వాత హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. శరీరం లో వైరస్ తీవ్రత అధికంమై ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అవ్వడం తో శుక్రవారం తాను తుది శ్వాసవిడిచాడు.మృతిడికి భార్య, ఇద్దరు కుమారులు వున్నారు.ఇంటికి పెద్దదిక్కుగా వున్నా తాను మరణచిడంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగింది.



Next Story