ఓల్డ్ మలక్‎పేటలో కొనసాగుతున్న రీపోలింగ్

by  |
ఓల్డ్ మలక్‎పేటలో కొనసాగుతున్న రీపోలింగ్
X

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ పరిధిలోని ఓల్డ్ మలక్‎పేట డివిజన్ పరిధిలో రీపోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. డివిజన్ 26లో బ్యాలెట్ పేపర్‎లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించారు. గుర్తులు తారుమారు కావడంతో ఎస్ఈసీ రీపోలింగ్ నిర్వహిస్తుంది. మలక్‎పేట డివిజన్ మొత్తం 69 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే వార్డు నెంబర్ 26లో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కాగా, రీపోలింగ్ సందర్భంగా మలక్‎పేట డివిజన్ లో స్థానిక సెలవు ప్రకటించారు అధికారులు. డివిజన్ పరిధిలో మొత్తం 54,655 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రీపోలింగ్ సందర్భంగా 12 మంది మైక్రో అబ్జర్వర్‎లను నియమించారు. 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఉండనున్నాయి.


Next Story

Most Viewed