గీతం యూనివర్సిటీ నిర్మాణాల తొలగింపు

by  |
గీతం యూనివర్సిటీ నిర్మాణాల తొలగింపు
X

దిశ, వెబ్‎డెస్క్: విశాఖలోని గీతం యూనివర్సిటీలో నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ఎండాడ, రుషికొండ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ యజమాన్యం ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు. విశాఖ ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన ద్వారం, సెక్యూరిటీ గదులు, ప్రహరీ గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కాగా, నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని వర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తోంది.

Next Story