తూర్పుగోదావరి జిల్లాలో రెండు రెడ్ జోన్ల ఎత్తివేత

by  |
తూర్పుగోదావరి జిల్లాలో రెండు రెడ్ జోన్ల ఎత్తివేత
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ విస్తరణ నియంత్రణలోకి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్ జోన్‌ను ఎత్తివేశారు. రాజమండ్రిలోని వీరభద్రాపురం, శాంతి నగర్‌లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. అయితే, గత 28 రోజులుగా ఈ పరిసరాల్లో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో రెడ్ జోన్ ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాజమండ్రిలో ఎనిమిది కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయి.

Tags: coronavirus, east godavari district, ap, rajahmundry, red zone, lockdown



Next Story

Most Viewed