పారా అథ్లెట్స్ కోసం.. చెన్నై టు పుదుచ్చేరి రెజీనా సైక్లింగ్

by  |
పారా అథ్లెట్స్ కోసం.. చెన్నై టు పుదుచ్చేరి రెజీనా సైక్లింగ్
X

దిశ, సినిమా : డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కాసాండ్రా గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టింది. మే, జూన్ నెలల్లో బెల్జియం, పోర్చుగల్‌లో వరల్డ్ పారా అథ్లెట్ చాంపియన్ షిప్ జరుగుతుండగా, ఇందులో పాల్గొనబోయే పారా అథ్లెట్స్‌కు ఆర్థికంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చింది.

ఆదిత్య మెహతా ఫౌండేషన్‌తో కలిసి ఫండ్ రైజింగ్‌ కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చెన్నై నుంచి పుదుచ్చెరి వరకు దాదాపు 140 కిలోమీటర్లు సైక్లింగ్‌లో పాల్గొంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన నటిని అప్రిషియేట్ చేస్తున్నారు నెటిజన్లు.


Next Story