మనిషి చేసిన పాపాల కోసమే యేసుక్రీస్తు అలా ఉండిపోయారు.. ఎమ్మెల్యే రేగా కాంతారావు

by  |
kantha rao
X

దిశ, మణుగూరు: తల్లిదండ్రులు నిన్ను మరచినను.. నేను నిన్ను మరువను, ఎడబాయను అన్న యేసుక్రీస్తు మాటలు ఎంతో గొప్పవని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు.
బుధవారం మండలంలోని కల్యాణ మండపంలో స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్, జెడ్పీటీసీ పోశం నరసింహారావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. క్రీస్తు దైవసంభూతుడని వ్యాఖ్యానించారు. మనిషి చేసిన పాపాల కోసమే యేసుక్రీస్తు సిలువలో ఉండిపోయారన్నారు. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి యేడాది క్రిస్మస్ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల‌కు కొత్త దుస్తుల పంపిణీ ఆన‌వాయితీగా కొనసాగిస్తుందన్నారు.

సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపాడు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘ సొసైటీ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, జావిద్ పాషా, ఎంపీటీసీ గాజుల రమ్య, మాజీ ఎంపీటీసీ మేకల రవి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, చర్చి పాస్టర్లు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed