తగ్గిన ప్లాట్ ఫారమ్ టికెట్ల ఆదాయం

by  |
railway platform
X

న్యూఢిల్లీ: ప్లాట్ ఫారమ్ టికెట్ల ద్వారా రైల్వేకు వచ్చే ఆదాయం 2020-21లో గణనీయంగా పడిపోయింది. కరోనా నేపథ్యంలో రైల్వే స్టేషన్లలోకి ప్రయాణీకుల ప్రవేశంపై గత కొన్ని నెలలుగా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాదితో పోలిస్తే 2020-21లో ఈ ఆదాయం 94 శాతం తగ్గిపోయినట్టు రైల్వే శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కుల కార్యకర్త(ఆర్టీఐ) చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రైల్వే బోర్డు సమాధానం ఇచ్చింది. 2020-21లో ఫిబ్రవరి వరకు రూ. 10 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించింది. గత ఐదేండ్లలో చూస్తే 2019-20లో అత్యధికంగా ఈ ఆదాయం రూ.160.87 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.

Next Story

Most Viewed