- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తాండూర్: రెబ్బెన మండలం మాధవాయిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని జెండగూడ గ్రామంలో శనివారం రెబ్బెన ఎస్ఐ భవానీ సేన్ 50 మంది నిరుపేదలకు సొంత ఖర్చులతో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జెండగూడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకు వస్తే, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సన్మార్గంలో నడవాలని సూచించారు. గ్రామస్తులు, యువకులు ఎస్ఐని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి, ఉప సర్పంచ్ గోపాల్, తుంగేడ మాజీ సర్పంచ్ పర్వతాలు యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story