- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పట్టణ సహకార బ్యాంకుల(యూసీబీ)ను బలోపేతం చేసేందుకు, ఈ రంగంలోని అవకాశాలను అన్వేశించేందుకు తగిన నివేదికను రూపొందించడానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సోమవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ ఎస్ విశ్వనాథన్ నేతృత్వంలోని ఈ కమిటీ పట్టణ సహకార బ్యాంకుల వేగవంతమైన పునరుద్ధరణకు, ఈ రంగం సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అంశాలను అంచనా వేయనుంది. దీనికి సంబంధించి మూడు నెలల్లో నివేదికను ఆర్బీఐ సమర్పించనుంది. నాబార్డ్ మాజీ ఛైర్మన్ హర్ష్ కుమార్ భన్వాలాతో సహా ఎనిమిది సభ్యుల ప్యానెల్ ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు తగిన చర్యలను సిఫారసు చేస్తుంది. కాగా, దేశీయంగా మొత్తం 1,482 పట్టణ సహకార బ్యాంకులు, 58 మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో మొత్తం పొదుపు డిపాజిట్ సుమారు రూ. 4.85 లక్షల కోట్లుగా ఉన్నాయి.
Next Story