ఆ నాలుగు బ్యాంకులకు RBI జరిమానా..

by  |
ఆ నాలుగు బ్యాంకులకు RBI జరిమానా..
X

దిశ, వెబ్‌డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించిన కారణంగా సిటీ యూనియన్ బ్యాంకు సహా మరో మూడు బ్యాంకులపై ఆర్‌బీఐ భారీగా జరిమానా విధించింది. వ్యవసాయ రుణాలతో పాటు విద్యా రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో నిబంధనలను పాటించని కారణంతో సిటీ యూనియన్ బ్యాంకుపై రూ. కోటి జరిమానాను విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

అలాగే, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించడంతో తమిళనాడు మర్కంటైల్ బ్యాంకుకు రూ. కోటి జరిమానా విధించింది. అదేవిధంగా, డిపాజిట్లపై వడ్డీ రేటు, కేవైసీ, ఫ్రాడ్ కేసుల పర్యవేక్షణ, రిపోర్టింగ్ మెకానిజం సర్క్యులర్ ఆదేశాలను పాటించనందుకు అహ్మదాబాద్ నూటన్ నగరిక్ సహకార బ్యాంకుకు రూ. 90 లక్షలు, ఆర్‌బీఐ కమర్షియల్ పేపర్ డైరెక్షన్స్-2017, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఆదేశాలను పాటించని కారణంతో పూణె దైంలర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 10 లక్షల జరిమానా ఆర్‌బీఐ విధించింది.

Next Story

Most Viewed