ఎమ్మెల్సీ రవీందర్ రావుకు ఘనంగా సన్మానం..

by  |
ఎమ్మెల్సీ రవీందర్ రావుకు ఘనంగా సన్మానం..
X

దిశ, మహబూబాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన తక్కెళ్ళపల్లి రవీందర్ రావు శుక్రవారం మహబూబాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ప్రియ శిష్యులు మంగలపెళ్లి కన్నా, జెర్రిపోతుల వెంకన్న గౌడ్, యాకయ్య యాదవ్, మడత వెంకన్న గౌడ్, సంద కృష్ణ యాదవ్, ఐలి సంతోష్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వివిధ కుల సంఘాలు, ఉద్యోగ సంఘ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ పదవి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story