- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబాబాద్: కష్టపడి సంపాదించి కూడబెట్టిన రెండు లక్షల నగదును ఎలుకలు చిత్తడి చిత్తడి చేశారు. ఆరోగ్యం బాగోలేక, కంతి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బును ఎలుకలు కొట్టడంతో బాధితుడు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండల పరిధిలోని వేంనూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… వేంనూరు గ్రామ శివారు ఇందిరా నగర్తండాకు చెందిన బి.రెడ్యా గత కొన్నేండ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పంటపై వచ్చిన డబ్బులను ఆపరేషన్ నిమిత్తం పోగుచేసి దాచుకున్నాడు. గతకొద్ది రోజులుగా కురుస్తు్న్న వర్షాల కారణంగా రెడ్యా నివాసం ఉంటున్న గుడిసె కురిసి, ఎలుకుల బెడద ఎక్కువైంది.
దీంతో భారీగా ఇంట్లో ఎలుకలు చేరి, సంచిలో దాచుకున్న రూ.2 లక్షల నగదును కొరికాయి. దీంతో అవి ఏమాత్రం పనికిరాకుండా పోయాయి. చిరిగిన నోట్లను తీసుకొని బాధితుడు పలు బ్యాంకులను సంప్రదించినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పలు బ్యాంకు అధికారులు రిజర్వ్ బ్యాంకు వెళ్లి సంప్రదించాలని సూచించారు. దీంతో ఎన్నో ఏండ్ల కష్టం ఎలుకల పాలుకావడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.