గోవింద‌రాజ ‌స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు

by  |   (  Updated:2021-02-17 06:45:56  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి-19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.ఈ సందర్బంగా ఏడు వాహనాలపై స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలోనే ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆల‌‌యంలోని క‌ల్యాణ మండ‌పంలోకి తీసుకొచ్చి, గంగాళంలో చ‌క్రస్నానం నిర్వహించనున్నారు. మరల ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజ స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. వాహనసేవల వివరాలు.. సమయం    [&hellip;]</p>

గోవింద‌రాజ ‌స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి-19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.ఈ సందర్బంగా ఏడు వాహనాలపై స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలోనే ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీ చక్రత్తాళ్వార్‌ను ఆల‌‌యంలోని క‌ల్యాణ మండ‌పంలోకి తీసుకొచ్చి, గంగాళంలో చ‌క్రస్నానం నిర్వహించనున్నారు. మరల ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజ స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.

వాహనసేవల వివరాలు..

సమయం వాహనం
ఉ. 5.30 – ఉ. 7.30 సూర్యప్రభ వాహనం
ఉ. 8.00 – ఉ. 9.00 హంస వాహనం
ఉ. 9.30 – ఉ. 10.30 హ‌నుమంత వాహనం
ఉ. 11.30 – మ. 12.30 పెద్దశేష‌ వాహనం
మ. 1.00 – మ. 2.00 ముత్యపుపందిరి వాహనం
మ‌. 2.30 – మ‌. 3.30 స‌ర్వభూపాల వాహనం
రా. 7.00 – రా. 8.30 గ‌రుడ‌ వాహనం

Next Story