వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు

by  |
వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తిని కొట్టి చంపారు గ్రామస్తులు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పగానిపల్లిలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉండటం గమనించిన మూర్తి అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం వృద్ధురాలి వద్దనున్న రూ. 4 వేలను అపహరించడం మరీ దారుణం. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో నిందితుడికి దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగక చెట్టుకు కట్టేసి కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. వృద్ధురాలి ప్రస్తుతం పుంగనూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

Next Story

Most Viewed