- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అచ్చంపేట: మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. సైదాబాద్లో చిన్నారి హత్యాచార ఘటన మరువకముందే మరో రెండు చోట్ల దారుణాలు జరిగి, తెలంగాణలో కలకలం సృష్టించాయి. తాజాగా.. నిద్రిస్తున్న వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సార్లపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఓ గృహిణి ఇంట్లో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి వచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను గమనించి అత్యాచారానికి ఒడిగట్టాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా నాటుసారా అమ్మకాలు జరుగుతుండటంతోనే ఈ దారుణాలు పెరిగిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. అత్యాచార ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి తెలిపారు.