అత్యాచార నిందితున్ని కఠినంగా శిక్షించాలి.. జర్నలిస్టు సంఘాల డిమాండ్

by  |
అత్యాచార నిందితున్ని కఠినంగా శిక్షించాలి.. జర్నలిస్టు సంఘాల డిమాండ్
X

దిశ,బెల్లంపల్లి: అత్యాచారానికి గురైన ఆరేళ్ల గిరిజన బాలిక చైత్రకు న్యాయం చేయాలని, అలాగే నిందితున్ని కఠినంగా శిక్షించాలని బెల్లంపల్లి జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కాంట చౌరస్తాలో కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గిరిజన బాలిక చిత్రపటానికి నివాళులు అర్పించి చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బద్రి వెంకటేష్ మాట్లాడుతూ అత్యాచార నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని గిరిజన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed