వాడిని ఉరి తీయండి.. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

by  |
వాడిని ఉరి తీయండి.. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
X

దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల చిన్నారి అత్యాచారం కేసులో శిక్షను అనుభవిస్తున్న నిందితుడు దినేష్ కు ఉరిశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో నార్సింగ్ కు చెందిన నిందితుడు దినేష్… ఐదేళ్ల పాపను లేబర్ క్యాంప్ ఆఫీస్ కు తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఆ కేసును సైబరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నిందితుడు దినేష్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఆ తీర్పుపై చిన్నారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed