ఓటీటీలోకి రణ్‌బీర్ ఎంట్రీ

by  |
Ranbeer Kapoor
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంటర్ కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఆంథాలజీ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయనున్నాడు. డిఫరెంట్ లవ్ స్టోరీస్‌తో కూడిన ఆంథాలజీ ‘ఐసా వైసా ప్యార్’లో యూనిక్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు. రణ్‌బీర్ చివరగా సంజయ్ దత్ బయోపిక్ సంజు(2018)లో కనిపించగా.. ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర, షంషేరా, యానిమల్‌’తో పాటు మరో ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టాడు. ఇవి షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ అయ్యేందుకు కనీసం ఏడాదైనా పట్టే అవకాశముండగా.. ఈలోపు ఆంథాలజీతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ న్యూస్‌తో హ్యాపీగా ఫీల్ అవుతున్న అభిమానులు.. దాదాపు మూడేళ్ల తర్వాత రణ్‌బీర్ యాక్టింగ్‌ను ఎంజాయ్ చేసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. కాగా దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.

Next Story