- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ మూవీ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేశ్. దాదాపు తెలుగు ఇండస్ట్రీలోని అందరి హీరోలతో కలిసి వెంకటేశ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, నాని, నాగ చైతన్య ఇలా చాలామందితో కలిసి నటించారు. అయితే వెంకీమామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకటేశ్ ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తర్వాత తాను మరో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. తన అన్న కుమారుడైన రానా దగ్గుబాటితో కలిసి, నెక్ట్స్ వెంకీబాబాయ్ అంటూ చెప్పకనే చెప్పాడు.
దీంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. దీనిపై ఎప్పుడెప్పుడు స్పష్టత వస్తుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అంశంపై తాజాగా రానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘బాబాయ్తో సినిమా చేయడం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. మంచి కథ కోసం ఇంతకాలం ఆగాను. లాక్డౌన్ టైంలో ఓ మంచి కథ దొరికింది.’ రానా అని అన్నారు. దీంతో రానా, వెంకటేష్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అనే విషయం స్పష్టం కావడంతో ప్రేక్షకుల్లోనే కాకుండా, సినిమా ఇండస్ట్రీలో కూడా ఆసక్తి నెలకొంది.