స్నేహ చికెన్ అధినేత రూ. కోటి విరాళం

by  |
స్నేహ చికెన్ అధినేత రూ. కోటి విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్ : వరదలతో ఆగమైన నగర వాసులను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలు విరివిగా విరాళాలు ప్రకటించారు. తాజాగా స్నేహ చికెన్‌ అధినేత రామ్‌రెడ్డి వరద బాధితుల సహాయార్థం సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.కోటి విరాళం ప్రకటించారు.

హైదరాబాద్ తిరిగి కోలుకోవాలని కోరుకుంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ.15 కోట్లు, తమిళనాడు సీఎం రూ.10 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రూ.2 కోట్లు, మైహోమ్‌ గ్రూప్‌ రూ.5 కోట్లు ప్రకటించగా.. సినీ హీరోలు మహేశ్‌బాబు, చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్, నాగార్జున, ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ, రామ్‌ పోతినేని తదితరులు కూడా విరాళాలు అందించి తమ పెద్ద మనస్సు చాటుకున్నారు.



Next Story

Most Viewed