- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీకి చెందిన పిరికి దద్దమ్మలు దాడులు చేశారని టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని త్వరలోనే ఈ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు చేపట్టిన ‘ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ దీక్షకు ఆయన సంఘీభావం వ్యక్తం చేశారు. అభిమానులకు బీపీ వచ్చి కార్యాలయాలపై దాడి చేశారని జగన్ చెప్పడంపై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా బీపీ ఉందని వారికి కర్రలకు జెండాలు కట్టి ఎగరేయడమే కాదు, అవసరమైతే అదే కర్రలతో కొట్టడమూ తెలుసనని చెప్పుకొచ్చారు. అయితే తమ పార్టీ అధినేత చంద్రబాబు క్రమశిక్షణతో నిబద్దతతో వ్యవహరించాలని సూచించారు కాబట్టే ఇప్పటికీ వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని చెప్పుకొచ్చారు.
అదే తాము కన్నెర్రజేస్తే వైసీపీ క్రిమినల్స్ ఏమవుతారో ఊహకే అందరన్నారు. ఈ సందర్భంగా హిందీలో మాట్లాడాలంటూ అభిమానులు గట్టిగా కేకలు వేశారు. దీంతో రామ్మోహన్ నాయుడు హిందీలో మాట్లాడారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అనుమతి ఇస్తే అన్ని భాషలలోనూ మాట్లాడగలనన్నారు. తెలుగుదేశం పార్టీపై వైసీపీ దాడులను హిందీలో ఖండించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకార్యకర్తలకు అండగా తామంతా ఉన్నామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. దీంతో అభిమానులు విజిల్స్తో మోత మోగించారు.