ఈసీగా నిమ్మగడ్డనే కొనసాగించాలి: హైకోర్టు

by  |
ఈసీగా నిమ్మగడ్డనే కొనసాగించాలి: హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కొత్త కమిషన్ నియామకం చెల్లదంటూ ఆదేశాలిచ్చింది. ఇదిలా ఉంటే.. సర్వీస్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తనను ఎన్నికల కమిషన్ నుంచి తొలగించిందంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటు నిమ్మగడ్డ వైపు.. అటు ప్రభుత్వం వైపు వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పును వెలువడించింది.

Next Story

Most Viewed