చంద్రబాబుతో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ భేటీ

by  |
చంద్రబాబుతో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుతో సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై విస్తృతంగా చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం చురుగ్గా అడుగులు వేస్తుండటంపై చర్చించారు. కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 12న విజయవాడలో అన్ని పార్టీలు, అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చంద్రబాబుకు రామకృష్ణ తెలిపారు. సమావేశానికి హాజరుకావాలని కోరారు. తన ఆహ్వానంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో సీఎం జగన్ తన స్పష్టమైన వైఖరి తెలపాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed