బిహార్ రెజిమెంట్‌ను కలిసిన రాజ్‌నాథ్ సింగ్

by  |
బిహార్ రెజిమెంట్‌ను కలిసిన రాజ్‌నాథ్ సింగ్
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడాఖ్ పర్యటనలో బిహార్ రెజిమెంట్ జవాన్లను కలిశారని రక్షణ మంత్రిత్వ కార్యాలయం ట్వీట్ చేసింది. గతనెల 15న చైనా ఆర్మీతో నేరుగా ఢీకొన్నది బిహార్ రెజిమెంటే. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది వీర జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. లడాఖ్‌లోని లుకుంగ్ పోస్టు పర్యటించినప్పుడు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిహార్ రెజిమెంట్ సైన్యంతో సంభాషించారు. వారి భుజాలు తడితో ఆత్మస్థైర్యాన్ని నింపారు. దీనికి సంబంధించిన వీడియోను రక్షణ మంత్రిత్వ ఆఫీస్ ట్విట్టర్‌లో ఆదివారం పోస్టు చేసింది.



Next Story

Most Viewed