బాలు.. పూర్తి ఆరోగ్యంతో తిరిగిరా : రజనీ

by  |
బాలు.. పూర్తి ఆరోగ్యంతో తిరిగిరా : రజనీ
X

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. కరోనా పాజిటివ్‌తో హాస్పిటల్‌లో చేరిన ఆయన పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని కొడుకు ఎస్పీ చరణ్ ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్నారు అభిమానులు. అటు పీఎం కార్యాలయం సైతం బాలు ఆరోగ్యం గురించి ఆరా తీయగా.. తను పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని, ఎప్పటిలాగే అభిమానులను తన గాత్రంతో ఆనందపరచాలని కోరుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.

సోషల్ మీడియాలో వీడియో మెసేజ్ పోస్ట్ చేసిన రజనీ.. బాలు డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చారనే వార్త సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపిన తలైవా.. బాలు 50 ఏళ్లుగా తన తీయని గాత్రంతో కోట్లాది ప్రజలకు సంతోషాన్ని ఇస్తున్నారన్నారు. తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు భాషల్లో పాటలు పాడిన బాలు.. సినీ ఇండస్ట్రీకి గొప్ప సేవలు అందించారన్నారు. ‘గెట్ వెల్ సూన్ డియర్ బాలు సార్’ అంటూ విష్ చేశాడు.

కాగా, ఎస్‌పీబీ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Next Story

Most Viewed