అభిమానులకు రజనీకాంత్ భావోద్వేగ లేఖ

by  |
అభిమానులకు రజనీకాంత్ భావోద్వేగ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు భావోద్వేగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు చేసిన ధర్నా తీవ్రంగా బాధించిందన్నారు. అనారోగ్య కారణాల వల్లనే రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని స్పష్టం చేశానని.. అయినా సరే ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని బలవంతం చేయొద్దని లేఖలో కోరారు. తన డెసిషన్ ఆల్రెడీ చెప్పేశానని.. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇకపై ఎలాంటి ఆందోళనలు చేయొద్దని ఫ్యాన్స్‌ను అభ్యర్థించారు.

కాగా, ఆదివారం చెన్నైలో అభిమానుల నిరసన ప్రదర్శన హాట్ టాపిక్ అయింది. తంజావూర్‌కు చెందిన ‘రజనీ మక్కల్ మంద్రమ్’ కార్యకర్త పిలుపుతో తమిళనాడు వ్యాప్తంగా తరలివచ్చిన అభిమానులు ఆందోళన చేపట్టారు. తలైవర్ పొలిటికల్ స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకోవాలని.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed