- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు భావోద్వేగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు చేసిన ధర్నా తీవ్రంగా బాధించిందన్నారు. అనారోగ్య కారణాల వల్లనే రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని స్పష్టం చేశానని.. అయినా సరే ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని బలవంతం చేయొద్దని లేఖలో కోరారు. తన డెసిషన్ ఆల్రెడీ చెప్పేశానని.. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇకపై ఎలాంటి ఆందోళనలు చేయొద్దని ఫ్యాన్స్ను అభ్యర్థించారు.
కాగా, ఆదివారం చెన్నైలో అభిమానుల నిరసన ప్రదర్శన హాట్ టాపిక్ అయింది. తంజావూర్కు చెందిన ‘రజనీ మక్కల్ మంద్రమ్’ కార్యకర్త పిలుపుతో తమిళనాడు వ్యాప్తంగా తరలివచ్చిన అభిమానులు ఆందోళన చేపట్టారు. తలైవర్ పొలిటికల్ స్టేట్మెంట్ను ఉపసంహరించుకోవాలని.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story