యావరేజ్ టార్గెట్.. రాజస్థాన్‌పై ముంబై గెలిచేనా..?

by  |
యావరేజ్ టార్గెట్.. రాజస్థాన్‌పై ముంబై గెలిచేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ వేదికగా జరగుతున్న ఐపీఎల్ 24వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యావరేజ్ స్కోర్ 171 నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ (41), యశ్వస్వి జైశ్వాల్ (32), సంజు శాంసన్(42), శివం దూబే(35) పరుగులు చేసి పెవలియన్ చేరారు. డేవిడ్ (7), రియాన్ పరాగ్ (8) పరుగులతో నాటౌట్‌గా నిలిచేసరికి నిర్ణీత 20 ఓవర్లు ముగిశాయి. ఇదే సమయంలో నాలుగు వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ 171 పరుగులు చేయగలిగింది. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, బౌల్ట్, బుమ్రా తలో ఒక వికెట్ తీసుకున్నారు.

Next Story

Most Viewed