రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఈరోజు కీలకం.. ఎందుకంటే..?

by  |
రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఈరోజు కీలకం.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైన సచిన్ పైలట్ తిరుగుబాటు ఎగురవేశాడు. దీంతో అతడిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. మరోవైపు వారిపై అనర్హత వేటు వేస్తూ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సచిన్ ఎమ్మెల్యే బృందం ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లింది. తమపై అకారణంగా అనర్హత వేటు వేశారని, ఇది సరికాదంటూ వారు కోర్టును ఆశ్రయించారు. అందులో సచిన్ సహా 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. వారు దాఖలు చేసిన పిటిషన్ ను నేడు హైకోర్టు విచారించనున్నది. విచారణ అనంతరం ధర్మాసనం ఏ విధంగా తీర్పు వెల్లడిస్తదోనని, రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎటు మలుపులు తిరుగుతదోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



Next Story

Most Viewed