త్వరలో రాజన్న దర్శనం?

by  |
త్వరలో రాజన్న దర్శనం?
X

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ కారణంగా మూతపడ్డ ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం తెరవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయంలో భక్తుల క్యూలైన్ల వెంబడి ఫిజికల్ డిస్టెన్స్ రింగ్స్ ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తరువాతే సాధారణ దర్శనాలకు అనుమతిస్తామని వేములవాడ రాజన్న ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 19 నుంచి వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed