మహేష్, ప్రభాస్ మల్టీస్టారర్ మూవీకి జక్కన్న ప్లాన్

by  |
మహేష్, ప్రభాస్ మల్టీస్టారర్ మూవీకి జక్కన్న ప్లాన్
X

‘ఆర్ఆర్ఆర్’ … దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న కాల్పనిక ఘట్టం. భగత్ సింగ్, కొమురం భీం కలిసి స్వాతంత్రోద్యమ పోరాటం చేస్తే ఎలా ఉంటుందనేది కథ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఈ మల్టీ స్టారర్ మూవీ రాబోతోంది. కాగా సినిమా అధికారిక ప్రకటన చేసే సమయంలో .. తారక్, చెర్రీలు ఒకే తెరపై కనిపించబోతున్నారన్న వార్తతో ఇండస్ట్రీ కొంత ఆశ్చర్యానికి గురైందనే చెప్పాలి. ఇద్దరు సూపర్ స్టార్ లను ఒకే స్క్రీన్ పై చూపేందుకు జక్కన్న ప్రయత్నించడాన్ని ప్రశంసించారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఫ్యాన్స్ స్టార్ వార్‌కు తెరపడుతుందని .. ఫ్రెండ్లీ అట్మాస్పియర్ క్రియేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇక ఫ్యాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి, మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.

అయితే జక్కన్న మరో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత బాహుబలి ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా మరో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్ లో వచ్చిన ‘వార్’ మూవీ లాంటి స్టైలిష్ యాక్షన్ మూవీని తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న సినిమాపై చర్చలు జరుగుతున్నాయని… ఇది కాస్తా సక్సెస్ అయితే కె.ఎల్.నారాయణ, యూవీ క్రియేషన్స్ మూవీని సంయుక్తంగా నిర్మిస్తాయని టాక్.

Next Story