కేటీఆర్ నువ్వు ‘మొక్క’వలసింది హిందువుల కాళ్లు..

by  |
కేటీఆర్ నువ్వు ‘మొక్క’వలసింది హిందువుల కాళ్లు..
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ఓటు వేసిన అనంతరం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నువ్వు మొక్కవలసింది సిలిండర్‌కు కాదని, బైంసాలో హిందువుల కాళ్లని కౌంటరిచ్చారు. మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఆదివారం మంత్రి కేటీఆర్ షేక్ పేట్ తహశీల్ధార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యావంతులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతం పెంచి, బాధ్యత చూపాలని కోరారు. ఓ మహానుభావుడు చెప్పినట్టు ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు నమస్తే పెట్టి ఓటేసేందుకు బయలుదేరానని కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు.

మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించి పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేటీఆర్ లాంటి మంత్రి దొరకడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని తీవ్రంగా విరుచుకుపడ్డారు. బైంసాలో హిందువులపై జరుగుతున్న దాడులు కేటీఆర్‌కు ఏమాత్రం కనిపించడం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా ఉందని ఫైర్ అయ్యారు. నాస్తికుడైన కేటీఆర్ సిలిండర్‌కు మొక్కి ఓటు వేశాననడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల సమస్యలపై పోరాడే వారికే ఓటు వేయాలని రాజాసింగ్ కోరారు.

Next Story

Most Viewed