- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతుబంధు పెట్టుబడి సాయం రైతులకు అందుతోంది. సోమవారం ఉదయం నుంచి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేశారు. ఒక్కరోజు 16.04 లక్షల మంది రైతులకు రూ. 494.11 కోట్లను విడుదల చేశారు. ఈ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయింది. ముందుగా ఎకరం వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులు 18.68లక్షల మంది ఉండగా… వీరికోసం రూ. 559.99 కోట్లను బ్యాంకులకు బదిలీ చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు మాత్రం 16,03,938 మంది మాత్రమే ఇచ్చారు. మిగిలిన రైతులు బ్యాంకు ఖాతాలు ఇవ్వలేదు. వారి ఆధార్ వివరాలతో బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాలేదని తేల్చారు. దీంతో వారికి రైతుబంధు సొమ్ము జమ కాలేదు. సోమవారం 16, 03,938 మందికి రూ. 494,10,86,470 కోట్లు విడుదల చేశారు. 9.88లక్షల ఎకరాల భూమికి ముందు రోజు రైతుబంధు సొమ్ము ఇచ్చారు. ఇక నుంచి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది.