- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీదాస్ బాగ్లో దుకాణాలు నీట మునిగాయి. పలు ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో నిత్యావసర వస్తువులు తడిచి పోయాయి. కనీసం ఉండేందుకు స్థలం కూడా లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
కూలిన చెట్లు…
చందానగర్ నుండి అమీన్ పూర్ వెళ్లే రోడ్డు పూర్తిగా వర్షం నీటితో మునిగి పోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్డును పక్కనే ఉన్న చెట్లు వర్షం దాటికి నేలకొరిగాయి.
చెరువు తెగి ….
భారీ వర్షాల కారణంగా మైలార్ దేవుల పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ సమీపంలోని అప్ప చెరువు తెగిపోయింది. కాగా కరిమా (30), అమీర్ (16), సాహెల్ (3)లు వరద నీటిలో మునిగి చనిపోయారు. మరో బాలుడు అయ్యన్ (7) గల్లంతైనట్లు భావిస్తున్నారు.
Next Story