రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

by  |
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, డోర్నకల్: రైల్వే ఉద్యోగి, మాజీ సర్పంచ్ భర్త రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గార్ల మండలం బుద్దరం గ్రామ మాజీ సర్పంచ్ భర్త వాంకడోత్ రాజు(54) ఈ రోజు తెల్లవారు జామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతి చెందిన వ్యక్తిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed