మరోసారి హాథ్రస్‎కు రాహుల్, ప్రియాంక..!

by  |
మరోసారి హాథ్రస్‎కు రాహుల్, ప్రియాంక..!
X

దిశ, వెబ్‎డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరోమారు హాథ్రస్‎కు వెళ్లనున్నారు. హాథ్రస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ బృందం బయల్దేరుతోందని, ఏ శక్తి తమను ఆపలేదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. హాథ్రస్ బాధిత కుటుంబం విషయంలో యోగి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరకాదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. యోగి ప్రభుత్వం నైతికంగా అవినీతిమయమైపోయిందని ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. బాధితురాలికి సరైన వైద్యం కూడా అందలేదని, ఆమె మృతదేహాన్ని బలవంతంగా తగలబెట్టారని ఆరోపించారు.

హాథ్రస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంక బయలుదేరిన పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని ఢిల్లీ ప్లాజా వద్ద భారీగా పోలీసులను మోహరించారు. టోల్ ప్లాజా వద్ద గేట్లను పోలీసులు మూసివేశారు.



Next Story

Most Viewed