ఆ బాధితులను పరామర్శించిన రాహుల్, ప్రియాంక

by  |
ఆ బాధితులను పరామర్శించిన రాహుల్, ప్రియాంక
X

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలోని హాథ్రాస్ బాధిత కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు పరామర్శించారు. మొదటి సారి పరామర్శించడానికి వెళ్లిన వీరిని యూపీ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

తాజాగా రాహుల్, ప్రియాంకతో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబాన్ని కలిసేందుకు యోగి ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ బృందం రెండు ప్రత్యేక బస్సుల్లో యూపీకి చేరుకోగా, మొత్తం ఐదుగురు సభ్యుల బృందం మాత్రమే బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని రాహుల్, ప్రియాంక యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story