- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ బాధితులను పరామర్శించిన రాహుల్, ప్రియాంక
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : యూపీలోని హాథ్రాస్ బాధిత కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు పరామర్శించారు. మొదటి సారి పరామర్శించడానికి వెళ్లిన వీరిని యూపీ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్, ప్రియాంకతో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబాన్ని కలిసేందుకు యోగి ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ బృందం రెండు ప్రత్యేక బస్సుల్లో యూపీకి చేరుకోగా, మొత్తం ఐదుగురు సభ్యుల బృందం మాత్రమే బాధిత కుటుంబాన్ని […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : యూపీలోని హాథ్రాస్ బాధిత కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు పరామర్శించారు. మొదటి సారి పరామర్శించడానికి వెళ్లిన వీరిని యూపీ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
తాజాగా రాహుల్, ప్రియాంకతో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబాన్ని కలిసేందుకు యోగి ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ బృందం రెండు ప్రత్యేక బస్సుల్లో యూపీకి చేరుకోగా, మొత్తం ఐదుగురు సభ్యుల బృందం మాత్రమే బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని రాహుల్, ప్రియాంక యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story






