‘యూరిన్ శాంపిల్‌’లో నీళ్లు కలిపింది..

by  |
‘యూరిన్ శాంపిల్‌’లో నీళ్లు కలిపింది..
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వాడకం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఇద్దరు నటీమణులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు సంజనా, మరొకరు రాగిణి ద్వివేది. వీరి ఇళ్లను కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే, వీరిద్దరి నుంచి శాంపిళ్లు సేకరించాలనుకున్న పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. శాంపిళ్ ఇవ్వడానికి సంజనా విముఖత వ్యక్తంచేస్తుండగా, రాగిణి మాత్రం పోలీసులకే మస్కా కొట్టింది.

పరీక్షల్లో భాగంగా ఆమెను యూరిన్ టెస్టుకు పంపించగా అందులో నీళ్లు కలిపింది. ఆ విషయాన్ని డాక్టర్లు గుర్తించారు. దీంతో మరోసారి శాంపిల్‌లో నీళ్లు కలుపకుండా యూరిన్ ఆమె నుంచి సేకరించారు. అయితే, దానికి సంబంధించిన ఫలితాలు వెలువడ లేదు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఫలితాలు వెలువడితే కన్నడ ఇండస్ట్రీ మరోసారి డ్రగ్స్ వాడకానికి అడ్డాగా మారిందా లేదా అనే విషయం వెల్లడికానుంది.

Read also..

ఇది నా కోరిక : శోభిత

Next Story