Radhe Shyam : సెట్‌లో ప్రభాస్ -పూజ మధ్య గొడవ.. అందుకే మాట్లాడట్లేదా?

by  |
Radhe Shyam : సెట్‌లో ప్రభాస్ -పూజ మధ్య గొడవ.. అందుకే మాట్లాడట్లేదా?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డేల రొమాంటిక్ డ్రామా ‘ రాధే శ్యామ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో వీరిద్దరి కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా కాగా.. బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్‌గానూ కాంప్లిమెంట్స్ అందుకున్నారు. అయితే ఆన్‌స్క్రీన్‌లో రొమాంటిక్‌గా కనిపించిన ఇద్దరికి ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం పడటం లేదని తెలుస్తోంది. పూజ అన్‌ప్రొఫెషనల్ బిహేవియర్, హై యాటిట్యూడ్‌ వల్ల ప్రభాస్ చిరాకుపడుతున్నాడని సమాచారం.

అయితే ఇదంతా బేస్‌లెస్ అని.. నిజానికి ప్రభాస్, పూజల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉందని, అది స్క్రీన్‌పై కూడా కనిపిస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మేకర్స్. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటారని, రెస్పెక్ట్ ఇచ్చుకుంటారని చెప్పారు. అంతేకాదు పూజ సెట్స్‌కు లేట్‌గా వస్తుందన్న రూమర్స్‌ను ఖండించిన మేకర్స్.. ఇదంతా ఎవరో కావాలనే సృష్టించారని అన్నారు. తనతో వర్క్ కంఫర్ట్‌గా ఉంటుందని.. ప్రభాస్‌తో మాత్రమే కాదు యూనిట్ సభ్యులందరితోనూ పూజ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపారు. కాగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ కొవిడ్ కారణంగా పోస్ట్ పోన్ కాగా.. జనవరి 14, 2022లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.


Next Story

Most Viewed