- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రెండు మూడేళ్లలో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించడం ఖాయమని మాజీ బౌలర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. అశ్విన్ కనుక ఇదే ఫామ్లో మరి కొన్నేళ్లు ఆడితే తప్పకుండా మరిన్ని రికార్డులు బద్దలు అవుతాయని ఆయన అన్నాడు. న్యూజీలాండ్తో జరిగిన సిరీస్లో కీలకంగా వ్యవహరించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో హర్బజన్ సింగ్ (417) రికార్డును అధిగమించాడు.
రవిచంద్రన్ అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434) మాత్రమే ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో కనుక ఇలాగే రాణిస్తే కపిల్ దేవ్ రికార్డు బద్దలు కావడం ఖాయమే. ‘అశ్విన్ గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. అతడి పనై పోయింది అనుకున్న ప్రతీ సారి యువ క్రికెటర్ల మాదిరిగా దూసుకొని వస్తుంటాడు. అతడి బౌలింగ్లో ఎప్పుడూ వైవిధ్యం ఉంటుంది. ఎంతో కచ్చితత్వంతో బంతులు విసురుతూ మంచి ఫామ్లో ఉంటున్నాడు. ఇదే ఫామ్ మరి కొన్నేళ్లు కొనసాగిస్తే కచ్చితంగా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు కొడతాడు’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.