క్విట్ ఇండియా ఉద్యమకారుడికి ఘన సన్మానం

by  |
క్విట్ ఇండియా ఉద్యమకారుడికి ఘన సన్మానం
X

దిశ సూర్యాపేట: క్విట్ ఇండియా ఉద్యమకారుడు బోలెద్దు వెంకట్రాములు చేసిన సేవలు మరవలేనివని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బొల్లెద్దు వెంకట్రాములును ఆయన నివాసంలో ఆదివారం కలెక్టర్ ఘనంగా సన్మానించారు.

అనంతరం అయన మాట్లడుతూ.. ఢిల్లీలో భారత రాష్ట్రపతి చేత క్విట్ ఇండియ ఉద్యమకారుల సన్మానానికి ఉమ్మడి జిల్లా నుంచి వెంకట్రాములకు ఆహ్వానం వచ్చిందన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందునా అయన ఢిల్లీకి వెళ్లలేని స్థితిలో ఉండటంతో ఆయన నివాసంలో వెంకట్రాముల దంపతులను సన్మానించారు కలెక్టర్‌. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకన్న, ఆర్.ఐ శ్రీధర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed