రోడ్డెక్కిన కొండచిలువలు.. ట్రాఫిక్ రూల్స్ తప్పలేదు

by  |
python
X

దిశ, పరకాల: అప్పుడప్పుడు కొన్ని ఘటనలు సహజసిద్ధంగానే జరిగినట్లు అనిపిస్తుంది. కానీ ఆ ఘటనలు సందేశాత్మకంగా మిగిలిపోతాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేటగుట్టలో జాతీయ రహదారిపై రెండు కొండచిలువలు రోడ్డెక్కిన వైనం ఆసక్తిగా మారింది. రోడ్డెక్కిన కొండచిలువలు రోడ్డుపై అడ్డదిడ్డంగా పాకుతూ పోకుండా రోడ్డు సైడ్ న పద్ధతిగా ఒకదాని వెనుక ఒకటి పాకుతూ పోవడం చూపరులకు ఔరా అనిపించింది. అప్పుడప్పుడు జ్ఞానం ఉన్న మనుషులే రోడ్డుపై అస్తవ్యస్తంగా ప్రయాణిస్తూ అనేక చిక్కుల్లో పడుతుంటారు. మూగజీవాలను కొండచిలువలు ఇలా క్రమ పద్ధతిలో రోడ్డుపై పాకడం శాయంపేట మండలంలో ఆసక్తికర చర్చకు దారితీసింది.


Next Story

Most Viewed