ఎంపీడీవో ఆఫీసులో కొండచిలువ.. భయం భయం

by  |
konda-chiluv-1
X

దిశ, చండ్రుగొండ: చండ్రుగొండ ఎంపీడీవో ఆఫీసులో కొండచిలువ కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పాత ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న మర్రిచెట్టులో సుమారు 8 అడుగుల కొండచిలువ 108వాహన సిబ్బందికి తారసపడింది. వెంటనే వారు చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు అక్కడికి చేరుకుని గమనించారు. మరో పాము కూడా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు వారు తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ ఉన్న చెత్తాచెదారం విష పురుగులకు ఆవాసంగా మారిందని, నిత్యం పనుల నిమిత్తం రాకపోకలు సాగించే మండల ప్రజలకు, కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ఇదిలావుంటే ప్రమాదాలలో ప్రజలను కాపాడే108 వాహన సిబ్బంది ఇక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Next Story

Most Viewed